నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 09 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టూబి యూనివర్సిటీ నందు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు ట్యాలీప్రైమ్ అనే అంశంఫై ఐదు రోజుల పాటు హాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఎం.బి.ఏ (ఫైనాన్స్) చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మదనపల్లెలోని గుడ్ విల్ ట్యాలీ అకాడమీ ట్రైనర్ ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ట్యాలీ ప్రైమ్ నేటి డిజిటల్ యుగంలో వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థులకు అకౌంటింగ్ పై ప్రాక్టికల్ జ్ఞానం అందించి పరిశ్రమకు అనుగుణమైన నైపుణ్యాల అభివృద్ధికి దోహద పడుతుందని తెలిపారు. వ్యాపార సంస్థల్లో రోజువారీ లావాదేవీల నమోదు, జీ.ఎస్.టి లెక్కలు, స్టాక్, సేల్స్, పర్చేస్ వంటి అంశాల డిజిటల్ రికార్డులను సులభంగా నిర్వహించడానికి ఇది అత్యంత ఉపయోగపడుతుంది. తయారీ సంస్థల్లో ముడి సరుకుల నుండి వస్తువుల తయారీ వరకు స్టాక్ ట్రాకింగ్, ప్రొడక్షన్ ఖర్చుల లెక్కింపు, సమయానుకూల ఆర్థిక రిపోర్టుల తయారీ చేయడానికి ట్యాలీ ప్రైమ్ ఉపకరిస్తుంది. చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు తక్కువ ఖర్చుతో తమ వ్యాపార ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ఇది ఒక ఉత్తమ పరిష్కారంగా నిలుస్తోంది అని అన్నారు. ట్యాలీప్రైమ్ నేర్చుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించడానికి వీలుకలుగుతుందని అన్నారు. ఐదు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ భాను శ్రీ రెడ్డి,ఫాకల్టీ కోఆర్డినేటర్స్ డాక్టర్ కే.వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎన్.గంగిశెట్టి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News