నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : అన్నమయ్య జిల్లా పోలీస్ విభాగంలో హోంగార్డులుగా విధులు నిర్వహిస్తూ, అకాల మరణం చెందిన ముగ్గురు సహచరుల కుటుంబాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం కొండంత అండగా నిలిచింది. హోంగార్డులు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేకరించిన తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి చేతుల మీదుగా శనివారం బాధిత కుటుంబ సభ్యులకు చెక్కుల రూపంలో అందజేశారు. జిల్లాలోని హోంగార్డుల ఒకరోజు డ్యూటీ అలవెన్సు నుండి సేకరించిన విరాళాల వివరాలను ఆర్. వెంకటరమణ (HG 445) భార్య శ్రీమతి డి. తులసమ్మ కు రూ 2,28,620/- లను, ఎస్.వి. చలపతి (HG 335) భార్య శ్రీమతి జి. సరళ రూ 2,25,780 లను, ఎం. వేణుగోపాల్ (HG 303) శ్రీమతి కె. చంద్రకళ 2,24,360 లను చెక్కు రూపంలో అందచేశారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ మాట్లాడుతూ.. "విధుల నిర్వహణలో మన సహచరులను కోల్పోవడం పోలీస్ కుటుంబానికి తీరని లోటు, ఒకరి కష్టం చూసి మరొకరు స్పందించడమే నిజమైన మానవత్వం. తోటి సిబ్బంది కుటుంబాలు వీధిన పడకూడదనే ఉద్దేశంతో హోంగార్డులందరూ కలిసి తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వడం అభినందనీయం. పోలీసు విభాగం కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే కాదు, కష్టాల్లో ఉన్న సొంత సిబ్బందిని కాపాడుకోవడంలోనూ ముందుంటుందని ఈ సంఘటన నిరూపించింది. మరణించిన హోంగార్డుల కుటుంబాలకు శాఖా పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్పీ శ్రీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె. సురేష్ కుమార్ రెడ్డి, ఏఆర్ఎస్ఐ బాలాజీ, హెడ్ కానిస్టేబుళ్ళు రమేష్, లక్ష్మిరెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో హోంగార్డులు పాల్గొన్నారు
Admin
Namitha News