నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 8 ః తంబళ్లపల్లె నియోజకవర్గం లోని తాగునీటి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు చిత్తూరు జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని కురబలకోట, బి కొత్తకోట, పీటీఎం, మొలకల చెరువు, తంబళ్లపల్లె మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకుల తో సమీక్షలు జరిపి ఆయా మండలాలలో తాగునీటి సమస్యలపై ఆరా తీశారు. మండల్ పరిషత్, జిల్లా పరిషత్ నిధులు తాగునీటి సమస్యలకు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వేసవిలో తాగునీటి సమస్యలను అధిగమించి ముందస్తుగా మండల స్థాయి నుండి పంచాయితీ సచివాలయ వ్యవస్థ నుండి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారంలో మండల పరిషత్ అధికారులతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అప్రమత్తంగా ఉండి పరిష్కరించగలిగామన్నారు. ఎక్కడైనా తాగునీటి సమస్య అధికారుల దృష్టికి వస్తే 24 గంటల లోపు పరిష్కారానికి ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా పారిశుద్ధ్యం మెరుగుకు స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా అవగాహన పెంచడంతోపాటు స్వచ్ఛరథం నిర్వహణతో మారుమూల గ్రామాలలోని చెత్త సేకరణ కు వస్తు రూపేనా చెల్లింపు కార్యక్రమం విజయవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు బురుజు లో పైప్ లైన్ సమస్య, తంబళ్లపల్లెలో మహిళలకు మరుగుదొడ్లు నిర్మాణాలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులు నాణ్యత లోపం లేకుండా చూడాలని లేనిపక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మల్లయ్య కొండ కింద మండల నిధులతో నిర్మించిన సిసి రోడ్డు పరిశీలించారు. ఆయన వెంట డి ఎల్ డి ఓ లక్ష్మీపతి,ఇన్చార్జ్ ఎంపీడీవో ఎం.వి ప్రసాద్, ఏవో థామస్ రాజా, ఏఈ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, బేరిశ్రీనివాసులు, పురుషోత్తం, కాలా నారాయణ, దండు వెంకటరమణ,సోమశేఖర్, సురేంద్ర, రామచంద్ర, ఎంపీటీసీలు, వైకాపా నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News