నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 24 : పుంగనూరు పట్టణానికి రెండవ ఆదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరైన సందర్బంగా మర్యాదపూర్వకంగా జిల్లా జడ్జి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియచేస్తూ నూతనంగా మంజూరైన కోర్టు ను ప్రస్తుతం ఉన్న కోర్టు సముదాయం లోనే ఏర్పాటు చేస్తే ఇటు కక్షిదారులకు, న్యాయవాదులకు సౌకర్యం గా ఉంటుందని తెలియచేసిన న్యాయవాదులు. జిల్లా జడ్జి గారు సానుకూలంగా స్పందించారని తెలియచేసిన పుంగనూరు న్యాయవాదుల సంఘం. ఈ కార్యక్రమం లో సీనియర్ న్యాయవాదులు ఆర్. వీరమోహన్ రెడ్డి, శివప్ప నాయుడు, బాలాజీ కుమార్, విశ్వనాథ రెడ్డి అధ్యక్షుడు, విజయ కుమార్ మరియు కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News