నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 30 : తంబళ్లపల్లె మండలంలో గతవారం ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి జలధార - జల హారతి కార్యక్రమంలో భాగంగా పలు ఉపాధి హామీ పనులను తనిఖీ చేసి పనులు ఊపందుకోవాలని చేసిన సూచనలతో ఉపాధి హామీ పనులు ఊ పందుకున్నాయి. ఉపాధి హామీ ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, బాలగంగాధర్ ,భూదేవి లు ఉపాధి పనులు వేగవంతానికి క్షేత్ర సహాయకులను ఉత్తేజపరిచడంతో ఉపాధి హామీ పనులుమండలంలోని గుండ్లపల్లి, గోపి దీన్ని, తంబళ్లపల్లె, ఆర్ఎన్ తాండ, కోసువారిపల్లి, బాలిరెడ్డిగారిపల్లి, కోటకొండ, రెడ్డి కోట, కుక్క రాజు పల్లి పంచాయతీలలో వందలాదిగా కూలీలు పనులకు తరలివస్తున్నారు. ఉపాధి పనులలో చెరువులు, కుంటలు, వాగులకు చెందిన కాలువ పనులు, ఫారం పాండ్స్ పనులకు ప్రాధాన్యత నిస్తున్నారు
Reporter
Namitha News