నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 26 : పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఇటీవల మరణించిన మాజీ మున్సిపల్ చైర్మన్ వహీదున్నీషా ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వహిదున్నీషా మృతి కి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి తో పాటు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప రాష్ట్ర జానపద కళల మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్ భాషా, పీకేయం వుడా మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్ రాయలసీమ జిల్లాల జోనల్ ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ షరీఫ్, రహమతుల్లా , చెంగారెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ భాషా, పట్టణ అధ్యక్షులు ఇర్ఫాన్, మాజీ కౌన్సిలర్ కిజార్ ఖాన్, వైసిపి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News