నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 21 ః తంబళ్లపల్లె మండలం లో పేరుకుపోయిన రీ సర్వే భూముల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు తాశీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో భూముల రీ సర్వే కారణంగా సుమారు 500 ఖాతాలలో జాయింట్ ఎల్ పి ఎం తోబాటు పలు రకాల సమస్యలు సమస్యలు పరిష్కారానికి మా రెవెన్యూ అధికారులు,సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇరు వర్గాల రైతుల సమక్షంలో పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే 139 ఖాతాల్లోని రీ సర్వే భూముల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి పక్కాగా పాస్ బుక్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహించి భవిష్యత్తులో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడటానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. భూముల రీ సర్వేలో సమస్యల పరిష్కారానికి జిల్లా, డివిజన్ స్థాయి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని రైతులు సైతం సమన్వయం పాటించి పరిష్కారానికి కలసి రావాలి సూచించారు.
Reporter
Namitha News