నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : విద్యాసంస్థల బస్సులు, సరుకు రవాణా వాహనాలు, లారీలు, మోటార్ క్యాబ్స్ మరియు ఆటో రిక్షాల డ్రైవర్ల కు మదనపల్లి లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం లో రోడ్డు భద్రత పై సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, రోడ్డు ప్రమాదాలు మరియు వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటంలో గుడ్ సమారిటన్ చట్టాలు మరియు గోల్డెన్ అవర్ భావన ఎంత కీలకమో వివరిస్తూ, ఆరోగ్యం, కంటి చూపు పట్ల ప్రాముఖ్యత వివరించి అవగాహన కల్పించిన తదనంతరం తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచితంగా కంటి పరీక్షలు చేయించి, ఆపరేషన్ అవసరమైన వారికి తిరుపతి కి వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలని తెలియచేస్తూ, మందులను పంపిణీ చేసిన ఆర్.టి.ఓ. అధికారులు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి అశోక ప్రతాప రావు ఆధ్వర్యంలో మదనపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర, అసిస్టెంట్ యం.వి.ఇన్స్పెక్టర్లు శ్రీహరి, శివలింగయ్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Namitha News