నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 13 : మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. రామసముద్రం మండలంలోని చెంబకూరు గ్రామ హరిజనవాడకు చెందిన గడ్డం లక్ష్మీపతి, దిగువపల్లికి చెందిన బి. మణి డైరెక్టర్లుగా ప్రమాణం చేశారు. చైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు మండి పల్లి రాం ప్రసాద్ రెడ్డి, నాదేండ్ల మనోహర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, జనసేన రాష్ట్ర నేత పసుపులేటి హరి ప్రసాద్, గంగారపు రామదాసుచౌదరి,మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ చల్లంపల్లె నరసింహ రెడ్డి, సేతు, నాదేళ్ల విద్యా సాగర్ నాయుడు, రాటకొండ గురు ప్రసాద్ ఎస్ ఏ మస్తాన్, ఎల్లంపల్లె ప్రశాంత్, రవికుమార్, డాక్టర్ అజంతుల్లా ఖాన్ , జె.కే. వర్మ, బండి మనోహర్ సనాఉల్లా, సాయినాథ్, గాంధీ రైతు నాయకులు, మార్కెట్ యార్డ్ అధికారులు రైతులు పాల్గొన్నారు. కొత్త కమిటీ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చైర్మన్ తెలిపారు.
Reporter
Namitha News