నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మే 26 : అనంతసాగరం మండల కేంద్రంలో ఇంటి స్థలం వివాదంలో మొబీనా,మస్తానమ్మ అనే ఇద్దరు మహిళలపై కొందరు దాడికి పాల్పడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.. గాయపడిన మొబీన, మస్తానమ్మలు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్కానింగ్ చేయించి అవసరమైతే నెల్లూరుకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. 20 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసిన స్థలంపై ప్రస్తుతం కొందరు వ్యక్తులు తమకు స్థలం కొంత కావాలని తరచూ గొడవలు పడుతూ నేడు వారిది కానీ మా స్థలంపై దౌర్జన్యానికి పాల్పడి 5 మందిపై దాడి చేశారని తీవ్రంగా గాయపడిన తాము వైద్యశాలలో చేరినట్లు గాయపడిన వారు తెలిపారు.. భారీగా తమపై దాడికి పాల్పడిన వ్యక్తులు గుంపులుగా తమ ఇంటిపైకి వచ్చి ఇంట్లో ఉన్న తమను గాయపరిచారని పోలీస్ వారు వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు
Reporter
Namitha News