నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఒకటో వార్డులో వైసిపి కోటి సంతకాల సేకరణ - హాజరైన నిస్సార్ అహ్మద్,అనూషా రెడ్డి - ఘనస్వాగతం పలికిన కౌన్సిలర్ శ్రీనివాసులు మదనపల్లె : మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కోటి సంతకాల సేకరణ,రచ్చబండ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది.ఇందులో భాగంగా ఒకటో వార్డు,అమ్మచెరువుమిట్ట గంగమ్మ ఆలయం వద్ద వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నియోజకవర్గం పరిశీలకులు అనూషా రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరుకాగా వీరికి కౌన్సిలర్ శాలువాలు,పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి,ఆయన తనయుడు,వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం,రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారన్నారు.2019 నుండి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు.అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు.గత వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ విధానంలో 17 మెడికల్ కళాశాలలో తీసుకొస్తే,వాటిని పిపిపి విధానంలో కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాకాలు చేస్తోందన్నారు.అందుకుగాను ఎకరా భూమిని కేవలం రూ.99లకే అప్పగించడం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు.పైగా గత ప్రభుత్వంలో వైద్య కళాశాలలో నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.అవాస్తవాలు,అబద్దాలు ప్రచారం చేయడంలో కూటమి నాయకులకు మించిన వారు లేరని ఎద్దేవా చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.అనంతరం కౌన్సిలర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఒకటో వార్డును ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని,ఇందుకు మున్సిపల్ చైర్ పర్సన్ మనూజా రెడ్డి సహాయ,సహకారాలు మరువలేనివన్నారు.వైసీపీ ప్రభుత్వ పాలనలో వార్డులో మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు.నిస్సార్ అహ్మద్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.అనంతరం శ్రీనివాసులు ఇంట ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో వైసీపీ శ్రేణులు పాల్గొన్నాయి.మున్సిపల్ చైర్ పర్సన్ మనూజా రెడ్డి,వైసిపి చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు శీలం రమేష్,రేపన ముని,ఇర్ఫాన్,చిప్పిలి మల్లికార్జున రెడ్డి,శారదా రెడ్డి,లలితా రెడ్డి,పద్మప్రియా రెడ్డి,మంజుల,వినుతా భాయి,నరసింహులు నాయుడు,చరణ్,చిన్నికృష్ణ మరియు వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News