నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 17 : తంబళ్లపల్లి మండలం బాల్ రెడ్డి గారి పల్లి (ముద్దలదొడ్డి) పంచాయతీలో రెండు గ్రామాలలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజంపేట టిడిపి రైతు నాయకుడు వెంకట్ రెడ్డి తెలిపారు. పంచాయతీలోని దొడ్డికాడపల్లిలో 40 కుటుంబాలు, కాంచేపల్లిలో 25 కుటుంబాలు ఉండి గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడింది. తాగునీటి సమస్య పరిష్కారానికి విధిలేని పరిస్థితుల్లో ట్యాంకర్లతో నీటిని తరలించి దాహార్తి తీరుస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం బాలి రెడ్డి గారి పల్లె పంచాయతీలోని రెండు గ్రామాల తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు
Reporter
Namitha News