Sunday, 26 July 2026 09:03:52 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 28 June 2026 06:04 PM Views : 58

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి: అన్నమయ్య జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీ సచివాలయం వద్ద నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మీనరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎంఎస్‌ఓతో కలిసి పలువురు చిన్నారులకు ఎమ్మెల్యే పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ, పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఆదివారం, సోమవారం, మంగళవారం మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని వారు సోమవారం లేదా మంగళవారం తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు నాయుడు, మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి, బాలమాది శేఖర్, శ్రీనాథ్, జేసీబీ వేణు, అనంత, టీబీ విభాగ అధికారి ప్రభాకర్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :