నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో కరెంట్ షాక్ కొట్టి రైతు మృతిచెందిన ఘటన మరువకనే నిమనపల్లిలో కరెంట్ షాక్ కొట్టి మరో రైతు బలి... మదనపల్లి మండలం, ఎనమలవారిపల్లి వద్ద శనివారం ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యానికి నేల వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాకి రైతు చంద్రశేఖర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన మరువకనే ఆదివారం నిమనపల్లి మండలం, ముస్టూరు పంచాయతీ, దిగువపల్లిలో కొబ్బరి చెట్టుకి కాయలు కోస్తున్న యువ రైతు శ్రీనివాసులు కు కింద వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి కరెంటు షాక్ కొట్టి చెట్టు పైనే మృత్యువాత చెందాడు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు కరెంటు షాక్ కొట్టి చనిపోవడంతో జిల్లాలో ట్రాన్స్కో అధికారుల తీరు తీవ్ర చర్చిని అంశంగా మారింది. ట్రాన్స్కో అధికారులు రైతుల పొలాల వద్ద ఉన్న లైన్లను పరిశీలించక పోవడం, లైన్ మ్యాన్లు విద్యుత్ లైన్ల ను పర్యవేక్షించడంలో చిత్తశుద్ధి లేకపోవడం. ఈ రెండు సంఘటనలు నిలువెత్తు సాక్ష్యాలుగా మారాయి. ఇవే కాకుండా వన్యప్రాణులను వేటాడడానికి వేటగాళ్లు తీసిన కరెంటు ఉచ్చులో చిక్కుకొని మదనపల్లి నియోజకవర్గంలోని పలువురు ఏడాది వ్యవధిలోనే విలువైన ప్రాణాలను పోగొట్టుకున్నారు. మన పల్లెలో రైతు కరెంట్ షాక్ తో మృతి చెందడం పట్ల తెలుగుదేశం శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు... ఉన్నతాధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న లైన్మెన్లు, ఏఈలను రైతుల చావుకు బాధ్యులను చేస్తూ.. కేసులు నమోదు చేసి, ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు...
Reporter
Namitha News