Monday, 27 July 2026 02:13:35 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నిమనపల్లి లో కరెంట్ షాక్ కొట్టి మరో రైతు బలి

నిన్న మదనపల్లి నేడు నిమ్మనపల్లి లో మృతులు

Date : 21 December 2025 07:20 PM Views : 135

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో కరెంట్ షాక్ కొట్టి రైతు మృతిచెందిన ఘటన మరువకనే నిమనపల్లిలో కరెంట్ షాక్ కొట్టి మరో రైతు బలి... మదనపల్లి మండలం, ఎనమలవారిపల్లి వద్ద శనివారం ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యానికి నేల వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాకి రైతు చంద్రశేఖర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన మరువకనే ఆదివారం నిమనపల్లి మండలం, ముస్టూరు పంచాయతీ, దిగువపల్లిలో కొబ్బరి చెట్టుకి కాయలు కోస్తున్న యువ రైతు శ్రీనివాసులు కు కింద వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి కరెంటు షాక్ కొట్టి చెట్టు పైనే మృత్యువాత చెందాడు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు కరెంటు షాక్ కొట్టి చనిపోవడంతో జిల్లాలో ట్రాన్స్కో అధికారుల తీరు తీవ్ర చర్చిని అంశంగా మారింది. ట్రాన్స్కో అధికారులు రైతుల పొలాల వద్ద ఉన్న లైన్లను పరిశీలించక పోవడం, లైన్ మ్యాన్లు విద్యుత్ లైన్ల ను పర్యవేక్షించడంలో చిత్తశుద్ధి లేకపోవడం. ఈ రెండు సంఘటనలు నిలువెత్తు సాక్ష్యాలుగా మారాయి. ఇవే కాకుండా వన్యప్రాణులను వేటాడడానికి వేటగాళ్లు తీసిన కరెంటు ఉచ్చులో చిక్కుకొని మదనపల్లి నియోజకవర్గంలోని పలువురు ఏడాది వ్యవధిలోనే విలువైన ప్రాణాలను పోగొట్టుకున్నారు. మన పల్లెలో రైతు కరెంట్ షాక్ తో మృతి చెందడం పట్ల తెలుగుదేశం శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు... ఉన్నతాధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న లైన్మెన్లు, ఏఈలను రైతుల చావుకు బాధ్యులను చేస్తూ.. కేసులు నమోదు చేసి, ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :