నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 08 : తంబళ్లపల్లె మండలం లోని పాడి రైతుల పశువుల పాల ఉత్పత్తి, పోషణ కు 50 శాతం సబ్సిడీపై తంబళ్లపల్లె పశుగణాభివృద్ధి కేంద్రంలో శనివారం పశువుల దాణా పశువైద్య శాఖ ఏ.డి డాక్టర్ సుమిత్ర, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, జేవివో కిరణ్ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏ.డి డాక్టర్ సుమిత్ర మాట్లాడుతూ మండలానికి పశువుల దాణా 37.5 టన్నులు 750 సంచుల పశువుల దాణా అర్హులైన రైతులకు పంపిణీ జరిగిందని రైతులు పాడి పశువులకు ఈ సబ్సిడీ దాణా సద్వినియోగం చేసుకొని పాల ఉత్పత్తి పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. పాడి రైతులు ఈ వర్షాకాలం పశువులకు సోకే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సకాలంలో సంబంధిత పశువైద్య కేంద్రాలలో పశువైద్యం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది శివానాయక్, రమణ, వాడు రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News