నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 18 : తంబళ్లపల్లె నియోజకవర్గం శాశ్వత రక్షిత తాగునీటి సౌకర్యం కోసం వాటర్ గ్రిడ్ పథకంలో తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న పైపులైన్ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డి వాటర్ గ్రిడ్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో తంబళ్లపల్లె నుండి ఈ పైప్ లైన్ పనులు శరవేగంగా జరగడానికి పనులు ప్రారంభించినట్లు కాంట్రాక్టర్ దుశ్య త్ తెలిపారు. తెలుగు గంగ నుండి తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలతో పాటు వెలిగల్లు ప్రాజెక్టు నుండి రాయచోటి నియోజకవర్గం వర్గానికి మొత్తం 3200 కోట్లు తో పనులు ప్రారంభమైనట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఈ వాటర్ గ్రిడ్ రక్షిత తాగునీటి పథకం పూర్తి అయితే భవిష్యత్తులో ప్రతి గడపలో తాగునీటి సమస్య పరిష్కారం కాగలదని స్థానిక టిడిపి నేతలు తెలిపారు.
Reporter
Namitha News