నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 12 : పర్యావరణ కాలుష్యం నివారణ కోసం ఓ యువకుడు ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టి సోమవారం తంబళ్లపల్లె లో ప్రవేశించాడు. తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ 2021 పర్యావరణ పరిరక్షణతో మొక్కలు పెంచాలని 11, 11,111 మొక్కలు నాటే లక్ష్యంతో సమాజ చైతన్యం కోసం జాతీయ జెండాతో సైకిల్ పై ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టాడు.ఈ యాత్ర 2028 లో ముగించి దేశ ప్రధానిని కలవనున్నట్లు ముత్తు సెల్వం తెలిపారు.భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణానికి సహకరించాలని విస్తృత ప్రచారంలో భాగంగా ఆయన ప్రపంచ యాత్రలో భాగంగా ఇప్పటికే బర్మా, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు యాత్ర ముగించుకొని ఇండియాలోని 23 రాష్ట్రాలు 44 కిలోమీటర్లు 10483 రోజులు చుట్టి 580 జిల్లాల మీదుగా పర్యావరణం లో భాగంగా మొక్కలు పెంచాలని పాఠశాలలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించుకుంటూ అలుపెరగని సాహస యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంగా తంబళ్లపల్లెలో స్థానిక ప్రజలు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా అభినందించారు. ముత్తు సెల్వం సైకిల్ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించి సాగనంపారు.
Reporter
Namitha News