నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా..తంబళ్లపల్లి లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే లు దర్శించుకున్నారు.స్వామి సేవలో పాల్గొన్న పీలేరు, మదనపల్లి శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,షాజహాన్ భాష,రాజంపేట తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు లు పాల్గొన్నారు.మల్లయ్య కొండ సముదాయంలోని మైనింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వెలికి తీయమని కూటమి నాయకులు హామీ ఇచ్చారు.గత 2011లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లయ్య కొండ మైనింగ్ ను జరగనివ్వమని ఉద్యమానికి తెరలేపిన నాయకుడు చంద్రబాబు అని,తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజల మనోభావాలను గౌరవించి మల్లయ్య కొండ లో మైనింగ్ చేపట్టబోమని మైనింగ్ కు కూటమే ప్రభుత్వం వ్యతిరేకమంటూ హామీ ఇచ్చిన పీలేరు ఎమ్మెల్యే నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. 2024 జనవరి 23వ తేదీన ఆర్ కె ఎర్త్ రిసోర్స్ నుంచి టెండర్లను జగన్ ప్రభుత్వ హయాంలో ఎర్ర కొండ మైనింగ్ ను వైకాపా ప్రభుత్వంలోనే అనుమతి ఇవ్వడం జరిగిందని,ఎప్పుడైతే ఎర్ర కొండకు టెండర్లు మంజూరు చేసారో యధావిధిగా శివపురం,సాదుకొండ కు మైనింగ్ ప్రక్రియ మొదలైందని కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ వాస్తవాలను ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పకపోవడం ఎంతవరకు సమంజసం అని నల్లారి ప్రశ్నించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ తంబల్లపల్లి లో ఎటువంటి మైనింగ్ చేపట్టబోమని అక్కడి ప్రజలకు వెళ్లి ధైర్యంగా చెప్పాలని మా నాయకులు చెబితే ఇక్కడికి వచ్చి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మల్లయ్య కొండ లో ఐరన్ ఓర్ కు వేసిన టెండర్లను రద్దుచేసేవిదంగా సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా ప్రయత్నం చేస్తామని భక్తులకు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఈ ప్రాంత ప్రజలు శాంతియుతంగా ఉండాలి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు.
Reporter
Namitha News