నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 16 : తంబళ్లపల్లె మండలంలో అధికార యంత్రాంగం మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా ప్రభుత్వ సంకల్పించిన స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమానికి సహకరించాలని తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రత్యేక అధికారి పీ.డి వెంకటరత్నం సూచించారు. శనివారం తంబళ్లపల్లి మండల కేంద్రంలో స్వచ్ఛ్ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. సచివాలయ కార్యదర్శిలు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు దృఢ సంకల్పంతో పారిశుద్ధ్యం మెరుగు పై దృష్టి సారించి తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మనతోపాటు మన భావితరాలైన విద్యార్థులకు అవగాహన కల్పించి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి కలసి రావాలన్నారు. అనంతరం పారిశుద్ధ్యం పాటించి, అవగాహన కల్పిస్తానని సభ్యులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, డిప్యూటీ మారుతీ కుమార్, ఏపీవో అంజనప్ప,కార్యదర్శులు శ్రీనివాసరావు, ఈశ్వర్ రెడ్డి, హరిప్రసాద్,టిడిపి నాయకులు నర్సింహులు, బాలకృష్ణారెడ్డి, పురుషోత్తం, వీరాంజనేయులు, సామి రెడ్డి, రామలింగారెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News