నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 07 : మహిళలను వేధిస్తే శిక్షలు తప్పవ ని తంబళ్లపల్లె కోర్టు తీర్పు నిదర్శనంగా నిలిచింది. మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన అంజలి ని తనకల్లు మండలం ఈ తోడు గ్రామం రెడ్డి శేఖర్ తో వివాహమైంది. ఆమెను భర్త రెడ్డి శేఖర్ తోపాటు మామ రామచంద్ర, అత్త యశోదమ్మలు తరచూ వేధించేవారు. ఈ విషయమై అంజలి వేధింపులు తాళలేక పుట్టింటికి చేరి తన భర్త, అత్తమాములపై 2018 లో తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్లో వేధింపుల పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు నినదించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ అంజలి పై వేధింపులు జరిగినట్లు రుజువు కావడంతో భర్త రెడ్డి శేఖర్ కు ఆరు మాసాల సాధారణ శిక్ష తోపాటు రూ1000 రూపాయలు జరిమానా చెల్లించని పక్షంలో మరో 15 రోజుల సాధారణ శిక్ష, రామచంద్ర కు మూడు నెలల సాధారణ శిక్ష తో పాటు రూ 1000 జరిమానా, చెల్లించని పక్షంలో 15 రోజులు సాధారణ శిక్ష, యశోదమ్మకు మూడు నెలల సాధారణ శిక్ష తో పాటు రూ 1000 రూపాయలు జరిమానా చెల్లించని పక్షంలో 15 రోజుల సాధారణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అనంతరం నిందితులను తంబళ్లపల్లె పోలీసులు మదనపల్లి సబ్ జైలుకు తరలించారు.ఈ వేధింపుల కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరాంజనేయులు తమ వాదనలు వినిపించారు
Reporter
Namitha News