Monday, 27 July 2026 02:17:12 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

డమరేశ్వర్ స్వర్ణలత ఇంటి ముందు హిజ్రా ధర్నా

డబ్బులు బంగారు తీసుకొని చంపుతామంటూ బెదిరింపు

Date : 17 December 2025 07:21 PM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తనను నమ్మించి, తన వద్ద లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, లక్షల్లో డబ్బులు తీసుకొని ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారంటూ హిజ్రా ఇంజరపు స్వాతి ఆరోపించారు‌. ఈ మేరకు బుధవారం సాయంత్రం గౌతమినగర్ లోని డమరేశ్వర్ స్వర్ణలత ఇంటిముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను డమరేశ్వర్ స్వర్ణలత ఇంటి సమీపంలో ఉండేదాన్నని, నన్ను నమ్మించి చీటీల వ్యాపారం పేరుతో తన వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బులు తీసుకొని తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తన వద్ద తీసుకున్నట్లు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు తమకు న్యాయం చేయలేదని, అందరినీ వారు మేనేజ్ చేసుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. మా అక్క 15 నెలలుగా కువైట్ లో సంపాదించిన మొత్తాన్ని వారికే ఇచ్చేశానని పేర్కొంది. గత ఐదు నెలలుగా తనను ఫాలో చేస్తూ, ఎక్కడికి వెళ్లినా అనుసరిస్తూ, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీంతో తాను ఇంటిలోనే ఉండి పోవాల్సి వచ్చిందని, వాళ్ళ వల్ల హౌస్ అరెస్ట్ అయ్యానని, తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని చెప్పుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని అయితే ఇంటి నుంచి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.ఏది ఏమైనప్పటికీ తాను ముఖ్యమంత్రిని కలుస్తానని, ఈ క్రమంలో తనకు ప్రాణహాని జరిగితే, అందుకు డమరేశ్వర్, స్వర్ణలత దంపతులే బాధ్యులని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు తమ బిడ్డలను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా హిజ్రా ఆవేదనను గుర్తించి ఆమెకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :