నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - నవంబర్ 13 : అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని పుల పుత్తూరు వద్ద ఆటో బోల్తా పడిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి మానవత్వం చాటుకొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు. క్షత్తగాత్రులు పులపత్తూరు ప్రాంతానికి చెందిన ఒంటిమిట్ట మల్లికార్జున, ఒంటిమిట్ట దేవి ఇరువురు ఆటోలో బోల్తాపడి ప్రమాదం జరగగా ఇటుగా వస్తున్న చమర్తి జగన్మోహన్ రాజు క్షతగాత్రులను పరామర్శించి స్వయంగా తన కారులో ఎక్కించుకొని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్య సదుపాయం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.
Reporter
Namitha News