నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - జనవరి 08 : చౌడేపల్లి మండలం దిగువపల్లి వద్ద బోయకొండ పై వెలసియున్న శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా రూ 48,85,165లు ఆదాయంగా సమకూరినట్లు కార్యనిర్వాహణ అధికారి, ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. గురువారం అమ్మవారి సన్నిధానం వద్ద గల ఆడిటోరియంలో 31 రోజులు గాను నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా నగదు తో పాటు 19 గ్రాముల బంగారం అభరణాలు, 292 గ్రాములు వెండిని ఆభరణాలు భక్తులు అమ్మవారికి ముడుపులుగా చెల్లించినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా రూ 28,943లు ఆదాయంగా సమకూరిందన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ గ్రామీణ బ్యాంకు సిబ్బంది, పోలీసులు, ఆలయ సిబ్బంది ఆలయ అర్చక అధికార సిబ్బంది సేవకులు పాల్గొన్నారు
Admin
Namitha News