నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 30 : రామసముద్రం మండల కేంద్రానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు కాపునేత మేస్త్రి రామచంద్ర 65 ఆదివారం గుండెపోటు తో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఇతనికి గుండె పోటు రాగా ఇతనిని హుటాహుటిన పుంగనూరు ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు మదనపల్లెలో రెఫర్ చేసారు.అయితే మదనపల్లె కు వెళ్ళే లోపే మార్గమధ్యం లో రామచంద్ర తుది శ్వాశ వదలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలరు ఇతని పార్థివ దేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.రామచంద్ర ఆకస్మిక మృతి పట్ల మండల టిడిపి నేతలు, కాపునేతలు దిగ్భ్రాంతి చెందారు.రామచంద్ర మరణం పార్టీకి తీరని లోటని,వీరి కుటుంబానికి టిడిపి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ పేర్కొంటూ మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు
Reporter
Namitha News