నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 20 : తంబళ్లపల్లె మండలం లో ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్వామా పీడీ వెంకటరత్నం, ఏపీడి నందకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పశువుల దాహార్తి తీర్చడానికి 34 పశువుల తాగునీటి నీటి తొట్లు నిర్మించారు. శుక్రవారం ఉపాధి హామీ ఎపిఓ అంజనప్ప తంబళ్లపల్లె మండలంలో పలు పశువుల తాగునీటి తొట్లు పరిశీలించి పశువుల దాహార్తి తీరడం పై హర్షం వ్యక్తంచేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నిర్మించిన పశువుల తాగునీటి తొట్టెలు మారుమూల గ్రామీణ ప్రాంతాల రహదారుల్లో నిర్మాణం జరిగి నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. వేసవి దృశ్యా మండలంలోని పలు పంచాయతీలలో పాడిరైతులు ఇంకా పశువుల నీటి తొట్టెలు కావాలని కోరుతున్నారని పశువులకు తాగునీరు అవసరం ఉండి కచ్చితంగా నీరు సరఫరా ఉండే ప్రదేశాలలో నీటి తొట్టెలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఆయన వెంట క్షేత్ర సహాయకుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News