నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 25 : పీలేరు సీఐ యుగంధర్ మహిళా అధికారిణి సునీత పై దుర్మార్గంగా, అహంకారంగా ప్రవర్తించి "కేసులు పెడతాను" అని బెదిరించడం అతి దారుణం, మహిళా హక్కులపై కాలక్రమంగా జరుగుతున్న దాడి.ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.నిన్న పీలేరులో చిత్తూరు నేషనల్ హైవే డివిజనల్ ఇంజనీర్ సునీతపై సీఐ యుగంధర్ ప్రజల ముందు అవమానకరంగా వ్యవహరించారు. బ్రిడ్జ్ పనుల ఆలస్యంపై వాదనలో పై అధికారిని అని చూడకుండా , కన్నీరు తెప్పించారు—ఇది పోలీసు వ్యవస్థలోని కట్టుబాటు లోపాలను తెలియజేస్తుందన్నారు . పీలేరు మదనపల్లె రోడ్డు క్రాస్ వద్ద ఆర్వోబీ నిర్మాణ పనుల సమీక్షలో సీఐ యుగంధర్ సునీతను పబ్లిక్లో లక్ష్యంగా చేసుకుని బెదిరించారు. ప్రజల ప్రాణాలు పోతున్నాయని చెప్పకుండా, మహిళా అధికారిణిని అవమానించడం మానవత్వ విరుద్ధం. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైనా, సమస్యలు అధికారికంగా పరిష్కరించాలి అలాకాకుండా రోడ్డుమీద మహిళను అవమానపరిచి ఆమెను ఏడిపించడం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు . మహిళా అధికారిణులను రక్షించాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే, సామాన్య ప్రజలు కు ఏమవుతారు? ఈ ఘటన మహిళా హక్కులపై దాడి—పోలీసు అధికారుల అహంకారానికి అవసరమైన పాఠం. సిపిఐ ఇలాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎల్లప్పుడూ పోరాడుతుంది. ఫ్లైఓవర్ ఆలస్యానికి కారణాలు సమగ్రంగా తెలుసుకోకుండా ఒక మహిళను బాధపెట్టి ఏమీ సాధించలేరు సీఐ పోలీసు యూనిఫాం ధరించి బాధ్యతలు మరచి, మహిళా అధికారిణిని పబ్లిక్లో అవమానించడం పోలీసు వ్యవస్థపై మచ్చలా మారుతోంది. ఇలాంటి బెదిరింపులు ప్రమాదాలకు దారితీస్తాయి—ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలోపెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తుందని, ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తామని తోపు కృష్ణప్ప డిమాండ్ చేశారు. మహిళల భద్రత, గౌరవం కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు
Admin
Namitha News