నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిన్నమండ్యం - ఏప్రిల్ 08: చిన్నమండ్యం మండలంలో రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నమండెం మండలంలో రోడ్డు భద్రత అంశంపై అధికారులతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి రోడ్డు భద్రత అంశాలను తనిఖీ చేశారు
ఈ సందర్భంగా ఏఏ ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, లైటింగ్, సూచిక బోర్డులు, కూడలల్లో లైటింగ్ సౌకర్యం ఉందా లేదా, హైవేకు కనెక్టివిటీ రహదారిలలో మరియు మలుపులలో రోడ్డు కిరువైపులా చెట్ల పొదలు పెరిగిన అంశాలు తదితరాలను కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా దాదాపు 40 ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ముఖ్యమైన కూడళ్లలో, మలుపుల వద్ద, స్పీడ్ బ్రేకర్లు ఉన్న ప్రాంతంలో సూచిక బోర్డులు, తప్పనిసరిగా లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హైవే కనెక్టివిటీ గ్రామీణ రోడ్ల కిరువైపులా చెట్లపొదలు తొలగించాలన్నారు. ఇందుకు సంబంధించి రవాణా, పంచాయతీ, విద్యుత్తు, పోలీసు, ఇతర సంబంధిత శాఖలన్నీ సమన్వయంగా కృషిచేసి ప్రమాదాల రహితంగా రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News