నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 03 : ప్రభుత్వ పాఠశాలల ఆవరణంలో ప్రకృతి వ్యవసాయంతో పెరటి తోటలు పెంచి తద్వారా ఆకుకూరలు, కూరగాయలు పండించి ఆరోగ్యం పెంపొందించుకోవాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. శనివారం ఆయన మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ పెరటి తోటలను పరిశీలించి ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, అధ్యాపక బృందం, సిబ్బందిని అభినందించారు. పాఠశాలలో స్వచ్ఛందంగా ఆకుకూరలు, కూరగాయల పండించే విధానాన్ని పరిశీలించి వారికి పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థుల విద్యా విధానంపై ఆరా తీసి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇష్టంగా కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించి ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రులకు, పాఠశాల అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని ప్రబోధించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, ప్రకృతి వ్యవసాయ ప్రతినిధులు రఘు, నిజాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News