Monday, 27 July 2026 11:51:37 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సైబర్ క్రైమ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

Date : 16 December 2025 07:29 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 16 : రామసముద్రం మండలం దిన్నెపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను రామసముద్రం మండలం సబ్‌ ఇన్‌స్పెక్టర్ పి. దిలీప్ కుమార్ మరియు రాయచోటి శక్తి టీం నుండి పోలీస్ కానిస్టేబుల్ మణికంఠ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులకు మహిళలపై నేరాలు (Crime Against Women), సైబర్ క్రైమ్‌పై జాగ్రత్తలు, రోడ్డు భద్రత (Road Safety Awareness), బాల్య వివాహాల నివారణ, మంచి అలవాట్లు అలవర్చుకోవడం, అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో బాలికలు ఎదుర్కొనే సమస్యలను వివరించి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, హెల్ప్‌లైన్ నంబర్లు ఉపయోగించాలని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల జాగ్రత్తలు పాటించాలని, తప్పుడు సమాచారం, మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు సుమారు 250 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ మరియు బోధన సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో భద్రతపై అవగాహన పెంచడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాఠశాల యాజమాన్యం అభిప్రాయపడింది.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: