నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అన్నమయ్య జిల్లా నూతన కమిటి ఎన్నిక - జిల్లా కన్వినర్ గా పోరెడ్డి రమణా రెడ్డి నియామకం - ప్రకటించిన రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అన్నమయ్య జిల్లా నూతన కమిటి ఎన్నిక చేయడం జరిగిందని రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య ప్రకటించారు. మంగళ వారం స్థానిక అనప గుట్ట నందు కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ సమావేశం రమణా రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య అన్నమయ్య జిల్లా కన్వినర్ గా పోరెడ్డి రమణా రెడ్డిని, కొ కన్వినర్ గా హరి ని నియమించడం జరిగిందని స్పష్టం చేశారు. అనంతరం వారి నుండి పార్టీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయల సీమ కు ప్రత్యేక ప్యాకేజి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమ అభివృద్ధి కోసం కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. మెడికల్ కళాశాల లను పిపిపి పద్దతిలో కాకుండా, ప్రజల ఆరోగ్య బద్రత, వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వమే కొన సాగించాలని డిమాండ్ చేశారు. ఆసియా లో అతి పెద్ద టమోటా మార్కెట్ లో రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం కోసం కోల్డ్ స్టోరేజిలు, పుల్ప్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయా లన్నారు. జిల్లా కన్వీనర్ రమణా రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా కాలువను పూర్తి స్థాయిలో తంబళ్ళ పల్లె, మదనపల్లె నియోజక వర్గాల్లో అను సంధానం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే రైతుల సాగునీటి సమస్య కి పరిష్కారం లభి స్తుందన్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. అలాగే అన్నమయ్య జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి రైతులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పన చెప్పటాలన్నారు. రాయల సీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కో కన్వీనర్ హరి మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు కష్టపడి పంటలు పండిస్తున్న వారికి సరైన గిట్టుబాటు ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతాంగం పై ప్రత్యేక శ్రద్ధను పెట్టి గిట్టుబాటు ధరలతో పాటు, ఉచిత పంటల బీమాను అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News