నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 28 : అన్నమయ్య జిల్లా బెంగుళూరులో ఇటీవల హత్యకు గురైన దేవిశ్రీ హంతకులను కఠినంగా శిక్షించాలని మదనపల్లె వైసిపి నియోజకవర్గం సమన్వయకర్త నిసార్ అహమ్మద్ డిమాండ్ చేశారు. వైసిపి నాయకులు రెడ్డెప్ప కుమార్తె దేవిశ్రీ బెంగళూరులో హత్యకు గురైన సందర్బంగా శుక్రవారం మండలం లోని చొక్కాండ్లపల్లి గ్రామ పంచాయతీ బిక్కంవారిపల్లిలో దేవిశ్రీ కుటుంబ సభ్యులను సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పరామర్శించి వారికి దైర్యం చెప్పారు.అనంతరం నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ దేవిశ్రీ హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఎంపి మిథున్ రెడ్డికి ఈ విషయం గురించి చెప్పానని త్వరలో మండల పర్యటన వచ్చినప్పుడు వారి కుటుంబ సభ్యుల కలుస్తానని చెప్పండని తెలిపారని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, గెవన్న, వైస్ ఎంపిపి వెంకటరమణారెడ్డి,గబ్బురి సుదర్శన్ బాబు రెడ్డివీరే గౌడ్, సర్దార్ బాషా కృష్ణప్ప,బిసి నాయకులు తిమ్మయ్య, కృష్ణారెడ్డి, సిపిఐ నాగప్ప, బాలాజీ, ఈశ్వర్ రెడ్డి, పాలు డైరీ విజయ్ గౌడ్,స్వామి, చెంగారెడ్డి, నరసింహులు, నాగార్జున, విఎస్.రెడ్డి, మల్లికార్జునరెడ్డి, చెన్నక్రిష్ణ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News