Sunday, 26 July 2026 08:00:38 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

కార్మికుల సమ్మెతో తంబళ్లపల్లె కంపు.. కంపు..!

Date : 02 June 2026 10:31 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 02 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లోని పంచాయితీ పారిశుద్ధ్య, పంప్ ఆపరేటర్లు పనులు ఆపేయడంతో తంబళ్లపల్లె ఒక్క రోజుకే కంపు కొడుతుంది. గత మూడు మాసాలుగా పంచాయతీ కార్మికులకు జీతాలతో పాటు మరమ్మత్తుల బిల్లులు చెల్లించకపోవడంతో మండల స్థాయి అధికారులు, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ్యపు పనులతో పాటు తాగునీటి సరఫరా సైతం ఆపేయడంతో తంబళ్లపల్లె ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారులకు మొరపెట్టుకున్న వారు కుంటి సాకులు చెబుతూ దాటవేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి మంగళవారం సెలవు పై వెళ్లడంతో వారి సమస్య పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. తంబళ్లపల్లె మండల కేంద్రంలో ప్రతిరోజు సుమారు ఐదు ట్రాక్టర్ల చెత్తాచెదారం తరలించాల్సి ఉండగా ఎక్కడికక్కడ చెత్త పేరుకు పోతోంది. మురికి నీటి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం తో ముక్కు పగిలేలా దుర్వాసన కొడుతోంది. ఉదయం నుండి నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ అధికారులు ఇంటింటికి తిరిగి ప్రజల వద్ద అన్ని రకాల పన్నులు ముక్కు పిండి వసూలు చేశారు. అయితే ప్రజల మౌలిక సదుపాయాలు ,సమస్యల పట్ల నిర్లక్ష్యంతో పట్టించుకోకపోవడం పై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పంచాయతీలో నిధులు ఉన్నా చెల్లించడానికి కుంటి సాకులు చెప్పడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసి పారిశుద్ధ్యపు పనులు, నీటి సరఫరా చేయకపోతే తంబళ్లపల్లెలో పారిశుధ్యం లోపించి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కాదు స్వచ్ఛ చెత్త కుప్పల కేంద్రంగా నిలవడం ఖాయం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :