నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 15: బీహార్ శాసనసభ ఎన్నికల్లో భారతీయజనతాపార్టీ నాయకత్వం లోని ఎన్డీఏ కూటమి అద్భుతమైన మెజార్టీ నమోదు చేసుకున్న నేపథ్యంలో గుర్రంకొండ మండలంలోని బీజేపీనాయకులు ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గుర్రంకొండ మండల బీజేపీ అధ్యక్షులు రామాంజులు నాయకత్వంలో గుర్రంకొండ బస్టాండ్ వద్ద బాణాసంచా పేల్చిస్వీట్లు పంచుకుంటూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి , పారదర్శక పాలనపట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నదే బీహార్ ఫలితాలు నిరూపించాయన్నారు. ప్రజల ఆశలు నెరవేర్చగల నాయకత్వం మోదీదేనని మరోసారి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ఎన్డీఏ విజయం దేశవ్యాప్తంగా అభివృద్ధికి పునాది వేస్తుందని బీహార్ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆనంద సంభరాల్లో మండల అధ్యక్షులు రామాంజులు, బీజేపీ శ్రీనివాసులు, రెడ్డిముని నాయడు, భారత్ గౌరి హోటల్ శ్రీన, వరద పరసా అమర, మరియు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News