Monday, 27 July 2026 01:52:26 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వాహన చోదకులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన యస్.ఐ. అనిల్ కుమార్

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం లో భాగంగా అవగాహనా కార్యక్రమం

Date : 15 January 2026 08:48 PM Views : 222

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 15 : తంబళ్లపల్లి మండలంలోని వాహన చోదకులు కచ్చితంగా రోడ్డు భద్రత పాటించి క్షేమంగా ఇళ్లకు చేరాలని ఎస్సై టి అనిల్ కుమార్ హితబోధ చేశారు. గురువారం సాయంత్రం తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో వాహన చోదకులకు అవగాహన కల్పించారు. వాహనం డ్రైవర్లు ఒరిజినల్ రికార్డులు తమ వద్ద ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ వాడాలని, అతివేగం, మద్యం సేవించి బండి నడపడం చేయరాదన్నారు. అసాంఘిక కార్యక్రమాలైన జూదం, కోడి పందాలు, సైబర్ నేరాలు, గంజాయి, బెల్ట్ షాప్ నిర్వహణ, బహిరంగ మద్యం సేవించడం, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, బాలికల ఈవిటీజింగ్ లాంటి చర్యలు చేపడితే కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామన్నారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రజలు తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి మీ ముందు ఉంటామని హామీ ఇచ్చారు. పై అసాంఘిక కార్యక్రమాలపై మండలంలోని ప్రతి గ్రామంలో విస్తృతంగా మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని ప్రజలు సైతం సహకరించి ఈ అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండి నేర రహిత సమాజం కోసం తమతో కలసి రావాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో పోలీస్ స్టేషన్ సిబ్బంది, వాహనం డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :