నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 24 : దేశవ్యాప్తంగా పునర్విక శ్రీ ఆరోగ్యం కోసం 16 కోట్ల ఇంజక్షన్ అవసరమై పాప ప్రాణం నిలపడం కోసం సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయమై పునర్విక శ్రీ కథనంపై తంబళ్లపల్లె యువత తీవ్రంగా స్పందించి మేము సైతం పునర్విక శ్రీ ప్రాణాలను నిలపడం కోసం మంగళవారం తమ వంతు సాయంతో పాటు తంబళ్లపల్లె పురవీధుల్లో కార్యాలయాలు, దుకాణాలు, బజార్లలో జోలి పట్టి నిధులు సేకరించారు. ఒక పసిబిడ్డ ప్రాణం కోసం మానవత్వంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని ఆ యువత నిధులు సేకరణను స్థానిక ప్రజలు అభినందిస్తూ తమకు తోచిన సాయం అందించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వ్యాపారులు, మనసున్న ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయం చేయడం హర్షనీయం.
Reporter
Namitha News