నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 07 : తంబళ్లపల్లె మండలం కొట్టాల సర్పంచ్ సహదేవరెడ్డి, మండల అధికారుల మధ్య మంగళవారం ఆసక్తికర సంఘటన ఎదురైంది. గత పది సంవత్సరాలుగా కొటాల సర్పంచ్ గా పనిచేస్తున్న సహదేవ రెడ్డి ఉదయం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని గ్రామంలో సమస్యలు ఎక్కువ అయ్యాయని నిధులు ఉన్నా ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రజల సమస్యలు తీర్చలేని ఈ పదవి నాకెందుకని మనస్థాపం చెంది తన రాజీనామా పత్రాన్ని అధికారులకు అందజేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సమస్యపై అవాక్కైన ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ లు సర్పంచ్ ను వారించి సమస్యల పరిష్కారానికే మేము ప్రాధాన్యత నిస్తామని నీ సమస్యను పరిష్కరించడానికి మేమున్నామని భరోసా ఇచ్చారు. అనంతరం అధికారులు పంచాయతీలో సర్పంచ్ కు ఎదురైన సమస్యలను ఆరా తీసి బుధవారం విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పడంతో సర్పంచ్ శాంతించారు. కొటాల పంచాయతీకి కార్యదర్శి లేకపోవడం ఇన్చార్జి కార్యదర్శి సర్పంచ్ కు సహకరించకపోవడం తో గ్రామంలో మౌలిక సదుపాయాలు, సమస్యలు ఎక్కువై ప్రజల నుండి ఒత్తిడి వస్తున్నట్లు సర్పంచ్ వివరించారు. అధికారులు వెంటనే ఈ సమస్యపై విచారణ చేయాలని ఎంపీడీవో, ఏవో లు డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ ను ఆదేశించారు.
Reporter
Namitha News