Sunday, 26 July 2026 11:11:24 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం -- డి.యం.హెచ్.ఓ. లక్ష్మీనరసయ్య

Date : 04 February 2026 07:17 PM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం -- డిఎమ్హెచ్ఓ లక్ష్మీనరసయ్య క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యమని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి కార్యాలయం నుండి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పై అవగాహనా సమావేశం నిర్వహించారు.‌ డిఎమ్హెచ్ఓ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనసైలి, ప్రవర్తన తో క్యాన్సర్ ను నియంత్రించవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఏడాది దాదాపు 35 వేల క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదు అవుతున్నాయన్నారు. అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే గత ఏడాది నవంబర్ 15 నుండి ఇంటింటి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఎన్సీడి 4.0 నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఎన్. సి. డి. ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శివప్రతాప్ మాట్లాడుతూ "ఒకే లక్ష్యం ఎన్నో కథలు" "మేమున్నామని మీకేమి కాదని" అని ఈ ఏడాది థీమ్ ను ఎంపిక చేశామన్నారు. గుట్కా, పోగాకు, మద్యపానం సేవించడం, ఎక్కువగా గర్భ నిరోధక మాత్రలు మింగడం వల్ల, వ్యాధినిరోధక శక్తి క్షీణిస్తుందన్నారు. కొన్ని జన్యు సంబంధ కారణాల వల్ల, ఊభకాయం వల్ల, క్రిమిసంహారక మందులు వాడటం, ఆహారంలో రసాయణాలు వాడటం వల్ల, వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ 14ఏళ్లు నిండిన అమ్మాయిలకు భవిష్యత్ లో గర్భషయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఇమ్మ్యూనిటీ పెంచడానికి హెచ్. పీ. వి. వ్యాక్సిన్ ఇవ్వాలని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, తొందరలో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చని, ఆరోగ్య కరమైన జీవనశైలీ పాటిద్దాం, ప్లాస్టిక్ ను నిషేదిద్దాం, క్యాన్సర్ ను నివారిద్దాం, క్యాన్సర్ పట్ల భయాన్ని వీడి అవగాహన పెంచుకుందాం, వదిలేద్దాం జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఉప్పు, చక్కర, మైదా, ఆయిల్, కారం తగ్గించుకుందాం క్యాన్సర్ ను నివారిద్దాం అంటూ నినాదాలు పట్టణ పురవీధుల్లో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జ్ణానాంబికా డిగ్రీ కళాశాలలో ప్రపంచ కాన్సర్ దినం పై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా టి. బి. అధికారి డాక్టర్ రాధిక, ఏ. ఓ. మధుసూదన్ రెడ్డి, 104నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్, డి. ఎమ్. ఓ. రామచంద్ర రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. కాన్సర్ పై అవగాహన ర్యాలీ చేస్తున్న వైద్యసిబ్బంది క్యాన్సర్ ను నివారిద్దామని ప్రతిజ్ఞ చేస్తున్న వైద్యసిబ్బంది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :