నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూలై 5 : మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల కు సంబంధించిన పీహెచ్.డి ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు 133 మంది అభ్యర్థులు హాజరయ్యారని, పరీక్షను పూర్తిగా పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. పరిశోధనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, పరిశ్రమలు మరియు ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యాలు, ఆధునిక పరిశోధనా మౌలిక వసతులతో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ పరిశోధకులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట అవకాశాలను అందిస్తోందని తెలిపారు. ప్రవేశ పరీక్ష అనంతరం యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హత మరియు ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఉపకులపతి తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షను యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, అసోసియేట్ డీన్ (పీహెచ్.డి ప్రోగ్రామ్స్) డాక్టర్ ఎన్. నంద కుమార్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సాయి కుమార్ పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
Reporter
Namitha News