నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19: అన్నమయ్య జిల్లా మదనపల్లి డిఎస్పీ గారి కార్యాలయంలో ఈరోజు సోమవారం“ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమాన్ని నిరహించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా నలుమూలల నుండీ వచ్చిన ప్రజల వద్ద నుండీ వారి సమస్యలను నేరుగా విని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, చట్టపరిదిలో ఆలస్యం చేయకుండా "తక్షణ న్యాయం అందించాలి, ఆలస్యం చేయరాదు అని ఆదేశించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలు వద్ద కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ-ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసాలు, ప్రేమపేరుతో మోసాలు, మరియు ఇతర సమస్యలపై ఎస్పీ గారు స్వయంగా విచారణ జరిపారు
పి.జి.ఆర్.యస్. ఫిర్యాదులపై మీరు తీసుకొన్న చట్టపరమైన చర్యలు, వివరాలతో కూడిన నివేదికలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలి అని స్పష్టం చేశారు.
Admin
Namitha News