నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నగిరి - జూన్ 24 : నగరి రూరల్ మండలం వేలావడి గ్రామ పరిధిలోని 153, 154 పోలింగ్ బూత్లలో SIR ప్రక్రియకు సంబంధించిన సమస్యలు, స్థానిక పరిస్థితులు మరియు ఓటర్ల సందేహాలపై మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి ఆర్.కె. రోజా గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పార్టీ BLAలు, మండల అబ్జర్వర్, టీం కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బూత్ల వారీగా SIR ప్రక్రియ ప్రగతి, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఓటర్లకు ఎదురవుతున్న ఇబ్బందులు, అవసరమైన పత్రాల వివరాలపై రోజా గారు BLAలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి ఓటర్లతో నేరుగా మాట్లాడి వారి సందేహాలు, సమస్యలను తెలుసుకున్నారు. SIR దరఖాస్తులను ఏ విధంగా నింపాలి, అవసరమైన వివరాలు, పత్రాలు ఏమిటి, దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని ఎలా సరిచేయాలి అనే అంశాలపై ఓటర్లకు, BLAలకు స్పష్టమైన అవగాహన కల్పించారు. మన పార్టీకి సంబంధించిన ఓటర్లను గుర్తించి, ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ మంత్రి ఆర్.కె. రోజా గారు స్పష్టం చేశారు. SIR దరఖాస్తులలో ఎటువంటి తప్పులు లేకుండా అవసరమైన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి సరిచేసుకోవాలని సూచించారు. అనంతరం సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ద్వారా దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయించాలని BLAలు, నాయకులు మరియు కార్యకర్తలకు ఆమె వివరంగా దిశానిర్దేశం చేశారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు SIR ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు మరియు సహాయం అవసరమైన ఓటర్లకు ప్రత్యేకంగా సహకారం అందించాలని ఆమె సూచించారు. బూత్ల పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సమాచారం అందిస్తూ, ఎవరూ ఈ ప్రక్రియకు దూరం కాకుండా చూడాలని BLAలకు సూచించారు. అలాగే ఓటర్ల నుంచి వచ్చే ప్రతి సమస్యను నమోదు చేసి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అబ్జర్వర్, టీం కమిటీ సభ్యులు, BLAలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News