నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 06 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని చెంబకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం వారం హెచ్.ఎం రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇంచార్జి హెచ్ ఎం నాగరత్నమ్మ అధ్యక్షతన నిర్వహించారు.ఎస్సై విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల, ఫోక్సొ చట్టం, రహదారి రవాణా నియమాలు,మహిళల భద్రత, మంచి అలవాట్లపై అవగాహనపై ఎస్సై మాట్లాడుతూ విద్యార్థు లు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకుని చదువు చెప్పిన ఉపాధ్యాయులకు తల్లి దండ్రులకు మంచి పేరు ప్రక్యాతలు తీసుకురావాలన్నారు. విద్యా ర్థులు ముఖ్యం గా ఫోన్ కి అలవాటు పడకండి పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ కి వెళ్ళకూడదన్నారు. ఫోన్ మంచికి వినియోగించుకోవాలని గ్రామల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీరు వెళ్లి మీ తల్లి దండ్రులకు ఎవ్వరైనా ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి అని అడిగితే మీరు చెప్పకుండా వుండాలన్నారు. సైబర్ నేరగాళ్లు వలన ఎంతో మంది ప్రజలు, ఐటీ ఉద్యోగస్తులు మోసపోతున్నారని వారి మోసాలకు బలి కాకూడదన్నారు.నేను చిన్నప్పటి నుంచి ఒక ఆశయం ఉన్నదని నేను కష్ట పడి చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి ఒక ఇండిక కారు కొనాలని కోరుకున్నానని ఇప్పుడు కారుకొన్నానని మీరు కష్టపడి చదువుకుని మంచిగా ఉద్యోగం సంపాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. మండలంలోని తిరుమలరెడ్డిపల్లె గ్రామంలో ప్రముఖులు గా ఉన్నారని వారిలో ముఖ్యం గా అన్నమయ్య కీర్తనలు ఆలపించే డాక్టర్ శోభా రాజు, కలెక్టర్ సుదర్శన్ రెడ్డి, సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో సీఐ గా వల్లాల శ్రీధర్ విధులు నిర్వహిస్తున్నారని, ఈ మధ్యనే ప్రముఖ సినీనటి సమంత ను వివాహం చేసుకున్న రాజ్ నిడి మోరు వీరి గ్రామానికి చెందిన వారే వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలన్నారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మీరు మాకు ఎప్పుడైనా ఈ నెంబర్ కు 100,108చేయండి మేము అందుబాటులో ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News