Monday, 27 July 2026 02:13:19 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రెండు రోజుల విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు

విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపు

Date : 05 June 2026 05:39 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రెండు రోజుల విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపు విశాలాంధ్ర, మదనపల్లి: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీలలో మదనపల్లెలోని ఎస్‌టియు కార్యాలయంలో రెండు రోజులపాటు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కే. మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, శాస్త్రీయ దృక్పథం, రాజకీయ అవగాహన పెంపొందించడమే ఈ శిక్షణా తరగతుల ప్రధాన లక్ష్యమన్నారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మహిళలపై దాడులు, యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోతున్న పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విద్యపై కార్పొరేట్ వ్యవస్థలు కొనసాగిస్తున్న దోపిడీలు, విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించేందుకు నిపుణులు ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ప్రస్తుత జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వలరాజుతో పాటు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రెండు రోజుల శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీలలో మదనపల్లెలోని ఎస్‌టియు కార్యాలయంలో రెండు రోజులపాటు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కే. మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, శాస్త్రీయ దృక్పథం, రాజకీయ అవగాహన పెంపొందించడమే ఈ శిక్షణా తరగతుల ప్రధాన లక్ష్యమన్నారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మహిళలపై దాడులు, యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోతున్న పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విద్యపై కార్పొరేట్ వ్యవస్థలు కొనసాగిస్తున్న దోపిడీలు, విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించేందుకు నిపుణులు ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ప్రస్తుత జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వలరాజుతో పాటు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రెండు రోజుల శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపునిచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: