నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 05 ః తంబళ్లపల్లి మండలంలో స్వచ్ఛ రథం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెంపుకు కృషి చేయాల్సి ఉంది. మంగళవారం అమరావతి స్వచ్ఛ ఆంధ్ర కమిషనర్ కార్యాలయ ప్రతినిధి తంబళ్లపల్లె మండలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి స్వచ్ఛరధ నిర్వహణపై ఆరా తీశారు. మధ్యాహ్నం మండలంలోని కొటాల పంచాయతీ లో స్వచ్ఛరథం నిర్వాహకులు గ్రామంలో ప్రజల నుండి పనికిరాని ప్లాస్టిక్ బాటిల్లు, వస్తు సామాగ్రి, పాత ఇనుప సామాగ్రి సేకరించడం వారు పరిశీలించారు. ఈ స్వచ్ఛరథం వస్తు సేకరణలో స్థానిక సచివాలయ సిబ్బంది సహకరించడం విశేషం. తనిఖీ అధికారులు మారుమూల గ్రామాలలో వస్తు సేకరణ పై మరింత చొరవ చూపి గ్రామాలలో ప్రజలలో చైతన్యం నింపి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించడానికి సచివాలయ సిబ్బందితోపాటు స్థానికంగా గల పాఠశాల అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు చైతన్య కార్యక్రమాలకు చేయూతనివ్వాలని సూచించినట్లు తెలిపారు
Reporter
Namitha News