నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడిగా నానబాల కుమార్ నియామకం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు ఆంజనేయ కుమార్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కాపునాడు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. సమావేశం లో పుంగనూరు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడిగా నానబాల కుమార్ ను నియమించడం జరిగినది.ఇందుకు అనుబంధంగా అన్నమయ్య జిల్లా కాపునాడు కార్యవర్గం,మదనపల్లి నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం, రాయచోటి నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం, తంబళ్లపల్లి నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం,పీలేరు నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం మరియు అన్నమయ్య జిల్లా యువకాపనాడు కార్యవర్గం తో కలిపి 66 మంది కార్యవర్గ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్బంగా నాన బాల కుమార్ మాట్లాడుతూ నాపై బాధ్యత ఉంచిన రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు ఆంజనేయ కుమార్ వారికి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు కీర్తిశేషులు పిల్లా వెంకటేశ్వరరావు తనయ పిల్ల శ్రీదేవి వారికి తిరుపతి కాపునాడు అధ్యక్షుడు సరిత నాగరాజు వారికి కడప రాయలసీమ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు రాము, శ్రీకృష్ణదేవరాయ కామ్స విగ్రహ దాత కాల వపల్లి కృష్ణమూర్తి వారికి మదనపల్లె బలిజ jAC అధ్యక్షులు ప్రొఫెసర్ మున్రతమయ్య వారికి శ్రీకృష్ణదేవరాయ కాపు సేవాలయ సొసైటీ అధ్యక్షులు తోట సుబ్బా నర్సయ్య, కాపునాడు సీనియర్ మోస్ట్ పెద్దలు నానబల మణిమరియు పెద్దలు నాతోటి స్నేహితులు,కార్యవర్గానికి పేరుపేరునా ధన్యవాదములు తెలుపుకుంటూన్నానని,కాపు బలిజల అభివృద్ధికి కృషి చేస్తానని నాతోటి కార్యవర్గముతో కలసి పార్టీ ప్రమాణం చేస్తున్నానని తెలిపారు.
Reporter
Namitha News