Monday, 27 July 2026 09:50:57 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆర్.టి.ఐ. దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడి నుండీ లంచం అడిగిన ప్రభుద్ధుడు

లంచం డబ్బులు తీసుకొంటూ ఏ.సి.బి. కి పట్టుబడిన తహసీల్దార్ చంద్రశేఖర్

Date : 09 December 2025 06:08 PM Views : 424

నమిత న్యూస్ - Andhra Pradesh / Hyderabad : హైదరాబాద్ - డిసెంబర్ 09 :: సాధారణంగా అధికారులు పనులు చేయడానికి, బిల్లులు మంజూరు చేయడానికి లంచాలు తీసుకుంటారు. అక్రమార్కుల గుట్టు బయటపెట్టేందుకు ప్రజలకు ఉన్న వజ్రాయుధం సమాచర హక్కు చట్టం. కానీ ఓ అధికారి ఆర్టిఐ కింద సమాచారం అడిగిన వ్యక్తి నుంచే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆ అవినీతిపరుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా అయితే మీకోసమే.నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలం తెరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తనకు తెలియకుండానే తన తండ్రి పేరు మీద ఉన్న భూమి ఇతరుల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని అధికారులను సంప్రదించాడు. దీనికి సంబంధించి గతంలో జారీ చేసిన మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని.. భూ యజమాని కొడుకు రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా ఫలితం లేకపోయింది. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి జారీ చేసిన మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ కావాలంటూ ఆర్టిఐ చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. సమాచార హక్కు చట్టం (RTI) కింద వివరాలు ఇచ్చేందుకు పేపర్ ఖర్చుల పేరుతో డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్ 15 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. హైదరాబాద్ బాలాపూర్‌లోని తన నివాసంలో డిమాండ్ చేసిన లంచం రూ.15 వేల తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసిబి అధికారులు. ఆర్టిఐ దరఖాస్తు దారుడు నుంచే డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్ లంచం తీసుకోవడంతో ఉద్యోగులంతా ముక్కున వేలేసుకుంటున్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :