నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 11 : తంబళ్లపల్లె మోడల్ స్కూల్లో ప్రకృతి వ్యవసాయ సాగు లో భాగంగా పెరటి తోట పెంపకంలో విద్యార్థుల సహకారం ప్రశంసనీయమని స్పెషలాఫీసర్ అమరనాథ్ రెడ్డి కొనియాడారు. బుధవారం ఆయన మోడల్ స్కూల్ సందర్శించి పెరటి తోటలో విద్యార్థులు విరామ సమయంలో కలుపు తీయడం గమనించి అభినందించారు. విద్యార్థులు విద్యతోపాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు, పెరటి తోట పెంపకం పనులు చేపట్టడంతో వారిలో క్రమశిక్షణ, చైతన్యం, ఆరోగ్యం, పర్యావరణం, ప్రకృతి వ్యవసాయం పై అవగాహన,మానసిక ఉల్లాసం పెంపొందుతాయని సూచించారు. విద్యార్థులు నడవడికపై శ్రద్ధ చూపిస్తున్న ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, అధ్యాపకులు , సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News