నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 14 ః అలనాటి మన తెలుగు సాంప్రదాయాలను నేటి ఆధునిక సమాజం మర్చిపోతున్న వేళ కనీసం నడకలు సైతం రాని చిన్నారులు బుడిబుడి అడుగులతో భోగి పండుగ సందర్భంగా గొబ్బిళ్ళ ఆట ఆడిన సన్నివేశం సబికులను ఆశ్చర్యపరిచింది. తంబళ్లపల్లి మండలం పరసతోపు పంచాయతీ కురువపల్లి అంగన్వాడి సెంటర్లో కార్యకర్త చిన్నారులకు విద్యతోపాటు ఆటలు, పాటలతో పాటు మన పూర్వికులు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచిన గొబ్బిళ్ళ ఆట నేర్పించి వారి చేత ప్రదర్శింపజేయడం హర్షనీయం
Reporter
Namitha News