నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 01 : తంబళ్లపల్లె మండలం లో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఎన్నికల విషయమై సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో అబ్జర్వర్ టీజీ వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి ల మధ్య వివాదం రేగింది. ఈ విషయమై ఇరువురు నాయకులు చర్చించి ఐకమత్యంతో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలు సజావుగా జరగడానికి అంగీకరించారు. మండలంలో కొన్ని పంచాయితీలలో గ్రామ కమిటీ అధ్యక్షులను మార్చడంపై నాయకులు చర్చ జరిపారు. గ్రామ కమిటీ ఎన్నికల విషయంలో మండల అధ్యక్షునిగా తన ప్రమేయం లేకుండా మార్చడం ఏంటని గతంలో అన్ని పంచాయతీలకు క్షేత్రస్థాయిలో ఎన్నికలు పూర్తయిన తిరిగి మార్చడం సరికాదన్నారు. ఈ విషయమై అబ్జర్వర్ వెంకటేష్, అందరి ఆమోదంతోనే అక్కడక్కడ మార్పులు చేశామని భవిష్యత్తులో ఐకమత్యంతో మండలంలో తెలుగుదేశం పార్టీ పటిష్టపరిచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
Reporter
Namitha News