నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 15 : మదనపల్లి పట్టణం నీరుగట్టు వారి పల్లి లో నివాసం ఉన్న తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చినబాబు కు ఆశీస్సులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మండిపల్లి, కార్యకర్తలు, అభిమానుల నడుమ కేకు కట్ చేసి అట్టహాసంగా నిర్వహించిన అభిమానులు. జన్మదిన వేడుకలలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో పాటు హాజరైన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ , టిడిపి సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి , జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ రామదాస్ చౌదరి, సీడ్ మల్లికార్జున నాయుడు,జ్ఞానాంబిక విద్యాసంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్, విజయ భారతి విద్యాసంస్థల అధినేత సేతు నల్లుస్వామి , రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం, పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్, రామసముద్రం మండల టిడిపి అధ్యక్షులు విజయ్ గౌడ్ మరియు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News