నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 29 : టిడిపి ఆవిర్భావం నుండి నేటి వరకు పార్టీ కోసం కష్టపడి గత వైకాపా అరాచక పాలనతో నష్టపోయిన కార్యకర్తలను పార్టీ ప్రక్షాళనతో ఆదుకోవాలని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబును ఎద్దుల వారి పల్లి పంచాయతీ నడింపల్లి కు చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకులు నరసింహనాయుడు, వెంకటరమణ, తెలుగుదేశం గ్రామ అధ్యక్షుడు నారాయణ, ఆర్ చంద్ర లు కోరారు. గురువారం వారు సుగవాసి ప్రసాద్ బాబును ఆయన స్వగృహంలో పూలమాలలు ,దృశ్యాలువలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. తంబళ్లపల్లె మండలంలో కూటమి అధికారంలో ఉన్నా మన పనులు జరగడం లేదని పార్టీకి కష్ట కాలంలో నిలబడి పని చేసినా ఫలితం లేకుండా పోతుందని ఇప్పటికైనా మీరు జోక్యం చేసుకొని పార్టీని గాడిలో పెట్టి కష్టపడిన నాయకులకు న్యాయం చేయాలని సూచించారు. దీనిపై సుగవాసి ప్రసాద్ బాబు స్పందిస్తూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు న్యాయం చేస్తామని త్వరలో తంబళ్లపల్లె పర్యటించి పార్టీని గాడిలో పెట్టి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
Reporter
Namitha News